Tuesday 20 October 2015

పెద్దాపుర సంస్థాన ఆదాయం PEDDAPURA SAMSTHANAM BORDERS, INCOME, TRADITION AND CULTURE

పెద్దాపుర సంస్థాన సరి హద్దులు - ఆదాయం - పరిణామక్రమం 



పెద్దాపురం ప్రాచీన ఆంద్ర దేశము లో పురాతన సంస్థానములలో ఒకటి. ఇంచుమించు ఐదు వందల ఏళ్ల పూర్వ చరిత్ర కలది.

గోదావరి మండలము లోని చాలా భాగము,
కృష్ణా - గుంటూరు మండలాలలోని కొంత భాగము,

విశాఖ పట్టణం లోని కొన్ని గ్రామాలు అయిన తోటపల్లి, రంప , చోడవరం, మొదలగు మన్యం ప్రాంతాలు ఒకప్పటి పెద్దాపురం సంస్థానములోనివి.

సంస్థానములోని ముఖ్య పట్టణం అయిన "పెద్దాపురం" తూర్పు గోదావరి జిల్లా లో రాజ మహేంద్రవరం (ఇప్పటి రాజముండ్రి) కి ఈశాన్య దిక్కు గా పది కోసుల దూరంలో (కోసు = ఇంచుమించు 3.1/2 కిలో మీటర్లు) ఉన్నది.

1803 సంవత్సరం నాటికి పెద్దాపురం సంస్థానం ఆదాయం పది లక్షలు.



సాలు సరి పేష్కషు సాలుసరి పేష్కషు ( కప్పం రూపము లో వచ్చే ఆదాయం) ఆరున్నర లక్షలు.

అంత పెద్ద సంస్థానం కాలక్రమంలో చిన్న చిన్న భాగాలుగా విభజించబడి చివరికి కొట్టాము, తుని ఎస్టేటు గా మారిపోయి, ఆ తరువాతి కాలంలో ఆంద్రప్రదేశ్ రాష్త్రం లో అంతర్భాగం అయ్యిపోయింది.


రాజా వేంకట సూర్య నారాయణ జగపతి రాజు గారి పేర నమోదయినటువంటి కొట్టాము ఎస్టేటు యొక్క రాబడి రెండున్నర లక్షలు పేష్కషు ( కప్పం రూపము లో వచ్చే ఆదాయం) ఇరవై ఆరువేల నూట డెబ్బై మూడు రూపాయలు కొట్టాము ఎస్టేట్ యొక్క ముఖ్య పట్టణం తాండవ నది ఒడ్డున ఉన్న తుని. Ref : కిమ్మూరు కైఫీయతు https://plus.google.com/+vangalapudisivakrishna/posts

https://archive.org/details/kimmurukaifiyatu00unknsher

పెద్దాపురం సంస్థాన పాలకులు ఇంటి పేరు వత్సవాయి - RULERS OF PEDDAPURAM VATSAVAYI DYNASTY AND THEIR HORIZEN





' పెద్దాపురం సంస్థాన పాలకులు ఇంటి పేరు వత్సవాయి'


పెద్దాపురం సంస్థాన పాలకులు పూర్వము ఉత్తర దేశము నుండి వలస వచ్చి, గోదావరి, నెల్లూరు, కృష్ణా, విశాఖపట్టణం మండలాలలో స్థిర పడిన క్షత్రియ కుటుంబాలలో ఒక కోవకి చెందినవారు.




వీరిలో మందపాటివారు - వత్సవాయి వారు అని రెండు వర్గాల వారు ముఖ్యులు.


కాశ్యపస గోత్రానికి చెందిన మందపాటి వారు ఒంగోలు లోనూ, వశిష్ట గోత్రానికి చెందిన వత్సవాయి వారు పెద్దాపురం లోనూ పాలకులుగా ప్రసిద్ధి చెందారు. వత్సవాయి వారు సూర్య వంశోద్భావులగు ఆంధ్రక్షత్రియులలో మిక్కిలి గొప్పవారు. వీరి మూల పురుషుడు దుర్జయుడని, గుడిమెట్ల సాగిపోతరాజు వీరి పూర్వులలో ఒక్కడని. వీరి ముని మనమడు (మనవడు కి మనవడు ) అయిన వత్సవాయి శ్రీ రామ రాజు గారు కాలమున వత్సవాయి అనే గ్రామ వీరి రాజ్యానికి రాజధాని అవడం చేత వీరి ఇంటి పేరు వత్సవాయి అయ్యిందని తెలుస్తున్నది *
                                                                                                                     మీ వంగలపూడి శివకృష్ణ

చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు - CHATHURBUJA TIMMARAYA JAGAPATHI BAHADDARU (1555 - 1607) PEDDAPURAM

పెద్దాపుర సంస్థాన చరిత్రము : చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు

                                తిమ్మరాజు గారి కాలం పదునాల్గవ శతాబ్దం ఉత్తరార్ధం (1555-1607)


శ్రీ రాజా వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారు సంస్థాన సంపాదకులు. ఆయన పరిసర ప్రాంతాలలో ఉన్న పాలకులు అందరినీ ఓడించి రాజ్యమును విస్తరింప చేసి పెద్దాపురం లో ఒక కోటను నిర్మించారంట.

తండ్రి శ్రీ వత్సవాయి పేర రాజు గారు, తల్లి గొట్టుముక్కల వారి ఆడపడుచు నారమాంబ గారు.

'తిమ్మరాజ శిఖామణి తేజరిల్లె
నతని కీర్తి నటించు శీతాద్రిసేతు
మధ్య పృధ్వీశ్వరాస్థాన మంటపములు'

- రామ విలాసము, అవతారిక, పు. 21.

ఆనాటి సుబేదారైన షేర్ మొహమ్మద్ ఖాన్ చతుర్బుజ తిమ్మ రాయ జగపతి బహద్దరు గారి యొక్క వీరోచిత కార్యాలను మెచ్చి ఒక కత్తి ని బహుమానం గా ఇచ్చాడట.

' షేరు మొహమ్మదు క్షీతిప శేఖరుఁ డద్భుత శౌర్య ధైర్య దు
ర్వారుఁడు మెచ్చి పైడిఁయొఱవాల్దన కేల నొసంగు వేళ దై
త్యారిసమానమూర్తి తన హస్తము మీఁ దుగ నందె వార్దిగం
భీరుఁడు వత్సవాయికుల పేరయ తిమ్మనృపాలుడుఁన్నతిన్’ - పైది, పు. 23.

విజయ నగర మహారాజు శ్రీ విజయరామరాజు గారు వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారి వీరత్వాన్ని వర్ణిస్తూ రచించిన చాటువు





ఆంభోజం కలయం సదృక్ష మవనే సాహిత్యరీత్యామ్ దృశో
ర్మాంధా తార మపార సంపది మహా బావే యశో రాశిషు
శత్రూణాం పురభంజనే దృతి గుణేకిం చోరగేంద్రంమతి
ప్రాగాల్భ్యే ప్రతిధాతి తిమ్మ నృపతిః పాకాహిత ప్రాభవః - విజయరామరాజు చాటువు


-------------------------------------------------------------- మీ వంగలపూడి శివకృష్ణ


https://plus.google.com/+vangalapudisivakrishna/posts

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...