Thursday 11 February 2016

First Poet of Peddapuram పెద్దాపురం తొలి కవి పండితులు: వెణుతురుబల్లి విశ్వనాధ కవి


తొలి కవి పండితులు: వెణుతురుబల్లి విశ్వనాధ కవి 


                   

పెద్దాపురం సంస్థానమును చతుర్భుజ తిమ్మ జగపతి గారు పరిపాలించే కాలంలో 1600 ప్రాంతం వాడగు శేష ధర్మములు అనే పద్య కావ్యమును రచించి గారికి అంకితం ఇచ్చారు 
విశ్వనాధ కవి యార్వేల నియోగి వెంకటామాత్యుల వారి కొడుకు అంతే కాదు బర్తృహరి సుభాషిత రత్నావళి రచించిన ఏనుగు లక్ష్మణ కవి గారి తాత అయినటువంటి ఏనుగు పెదలక్ష్మణ కవి గారికి మేనమామ (ఏనుగు పెదలక్ష్మణ కవి గారు ద్రౌపదీ పరిణయం అనే ప్రభంధమును రచించారు)
ఇతను శ్రీరామ విజయము అనే యక్ష గానం - 
గౌరీ వివాహం అనే ద్విపద ప్రభందము ను 
హరీశ్చంద్ర చరితము అనే నిర్దోష్ట్య ప్రభందము ను 
పారిజాతాపహరణం ను సంస్కృతం లోనూ రచించినారు దురదృష్టవ శాత్తూ ఈయన రచించిన గ్రంధాలన్నీ కూడా కాల గర్భంలో కలిసిపోయినవి కానీ ఏనుగు లక్ష్మన కవి గారి గ్రందాల ద్వారా వెణుతురు బల్లి విశ్వనాధ కవి గారి గొప్పతనాన్ని తెలుసుకొనవచ్చు

Salajarya Ganga Raju, Peddapuram, పెద్దాపురం ఆస్థాన కవి - సలజర్ల గంగరాజు తిట్టు కవితలో దిట్ట


పెద్దాపురం ఆస్థాన కవి - సలజర్ల గంగరాజు తిట్టు కవితలో దిట్ట ఇతడు

                                 
తిట్టు కవిత్వమా తిట్టడం కూడా పెద్ద గొప్పగా చెప్తున్నావేంటి రా నాయనా అని నన్ను తిట్టకండి. ఇది చదవండి

                            రాయ జగపతి మాహారాజు గారు పెద్దాపురాన్ని పరిపాలిస్తున్న రోజులవి (1797 - 1804) అప్పటి పెద్దాపురమునకు అనప్పిండి విస్సన్న దివాను గా ఉండేవాడు ఈయన మహా కర్కోటకుడు ప్రజలను అనేక విధాల ఇబ్బందులకు గురిచేసేవాడు ఈ విషయాన్ని తెలుసుకున్న నలజర్ల గంగరాజు లేని పని కల్పించుకుని నేరుగా దివాను దగ్గరకు పోయి మీరు మహా గొప్పవారు మిమ్మల్ని పొగడకుండా ఉండలేక పోతున్నాను అంటూ స్తుతిస్తున్నాను అనే నెపముతో మూడఁవస్థానమున 'హ కారమును ప్రయోగిస్తూ ఒక పద్యము అల్లి చెప్పెనంట దాని అర్ధము కొన్నాళ్ళకి గానీ ఈ దివానుకి తెలియ రాలేదంట. తెలుసుకొన్న కొన్నాళ్ళకి ఈ దివాను దిగులుతో మరణించినాడంట.
కొందరి తిట్టు కవిత్వాలు
వేములవాడ భీమకవి తిట్టు కవిత 
"గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకుమంచు నీత్రిప్పుడు బాపలందరును దిట్టిరి కావున నొక్కమారు నీయప్పములన్ని కప్పలయి యవ్నము సున్నముగాగ మారుచున్బప్పును శాకముల్ పులుసు పచ్చడులుం జిరురాలు గావుతన్"
13వ శతాబ్దానికి చెందిన ఖడ్గ తిక్కన యుద్ధ రంగమునుండి పారిపోయి ఇంటికి రావడంతో అతని భార్య చానమ్మ అతని స్నానానికి మంచం అడ్డుపెట్టి పసుపు ఉండ పెట్టడంతో ఇదేమిటని అడిగిన భర్తతో ఆమె ..
"పగరకు వెన్నిచ్చినచో, నగరే నిను మగతనంపు నాయకులెల్లన్ముగురాడువారమైతిమి, వగపేటికి జలకమాడ వచ్చినచోటన్" అంది.
14-15 శతాబ్దాలకు చెందిన శ్రీనాధుడు.
"సిరిగల వానికి జెల్లును దరుణుల బదియారువేల దగ బెండ్లాడన్దిరిపమున కిద్దరాండ్రీ, పరమేశా! గంగ విడువు, పార్వతిచాలున్" అన్నాడు
16వ శతాబ్దానికి చెందిన తెనాలి రామకృష్ణుడు
"గంజాయి త్రాగి తురకల సంజాతులగూడి కల్లు చవిగొన్నావా?లంజెల కొడకా! యెక్కడ, కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్"
మరి కొన్ని
"నక్కలు బొక్కలు వెదకును, నక్కరతో నూరబంది యగడిత వెదకున్కుక్కలు చెప్పులు వెదకును, దక్కడి నా లంజెకొడుకు తప్పే వెదకున్".
"ఆడినమాటలు దప్పిన, గాడిదకొడుకంచు దిట్టగా వినియయ్యో!వీడా నా కొక కొడుకని, గాడిద యేడ్చెంగదన్న ఘనసంపన్నా!"
ఇంకా ఇలా చాలానే వున్నాయి నాకు సేకరించే ఓపిక వున్నా మీకు చదివే ఓపిక ఉండద్దూ ... !

Peddapuram MuttaDi by Buddavarapu Pattabi ramayya in 1928 పెద్దాపురం ముట్టడి

1928 పెద్దాపురం ముట్టడి : బుద్ధవరపు పట్టాభిరామయ్య 



స్వాతంత్య్రాభిలాష ను తెలుగు జాతి నర నరాలకు ప్రవహింప జేయడంలో చారిత్రిక నాటకాలు ప్రముఖ పాత్రను పోషించాయి అని చెప్పడం లో ఏ విధమైన సందేహం లేదు అందులో భాగంగానే 1920-30లలో అనేక చారిత్రక నాటకాలు వెలువడి ప్రదర్శితమయ్యాయి. నాటకాలను ఓ ప్రధాన ప్రచార సాధనంగా ఆనాటి నాయకులు ఉపయోగించారు. అందులో ముఖ్యంగా శ్రీ బుద్దవరపు పట్టాభిరామయ్య గారి 'మాతృ దాస్య విమోచన (1924), పెద్దాపురం ముట్టడి (1928) చెప్పుకోతగినవి.

 144 పేజీల ఈ పెద్దాపురం ముట్టడి అనే కథని మరియు మన పెద్దాపురం నివాసి అయిన శ్రీ బుద్దవరపు పట్టాభి రామయ్య గారి గురించిన విషయాలను త్వరలోనే పొందుపరుస్తాను అని తెలియ చేసుకుంటూ






                                                                                     మీ వంగలపూడి శివకృష్ణ

First Novel of Telugu about Peddapuram తెలుగు తొలి నవలలో పెద్దాపురానికి పలు పేజీలు




తెలుగు తొలి నవలలో పెద్దాపురానికి పలు పేజీలు


మొట్టమొదటి సాంఘికనవల 'రాజశేఖర చరిత్రము' లో పెద్దాపురం


          
గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు (1848–1919) ఆనాటి సాంఘిక దురాచారాలు - మూఢ నమ్మకాలు నేపద్యంలో ‘ఆలివర్ గోల్డ్ స్మిత్’ ఆంగ్లం లో రచించిన 'ది వికార్ అఫ్ ది వేక్ ఫీల్డ్' నుండి స్ఫూర్తి పొంది తెలుగులో 135 సంవత్సరాల క్రితమే రచించిన 'రాజశేఖర చరిత్రము’ లో ఎనిమిదవ ప్రకరణం మొదలుకొని నవల చివరివరకూ ఎన్నో ఆసక్తి కరమైన మలుపులు ప్రతీ మలుపులో ‘పెద్దాపురం’ సంగతులు 
‘కుమ్మరి వీధి దహనం’ - 
‘గ్రామ దేవత మరిడమ్మ తల్లి జాతర’ 
 మంత్రజుడు వీరదాసు విన్యాసాలు 
కట్టమూరు ఊరి విశేషాలు 
పెద్దాపురం మహారాజు దయార్ద హృదయం -

ఆసక్తి కలవారు పూర్తి కధ కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి
 https://plus.google.com/+vangalapudisivakrishna/posts/

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...