Monday 31 October 2016

Centinery Celbrations to Peddapuram Municipality : Councilors వందేళ్ళ పెద్దాపురం మున్సిపాలిటీ

పెద్దాపురం చరిత్ర
వందేళ్ళ పెద్దాపురం మున్సిపాలిటీ కి వందనం
----------------------------------------------
శత వసంతాల పురపాలకం
పెద్దాపురం ప్రాచీన వైభవానికి తలమానికం
పాలక సేవక సమ్మేళనమై
ప్రజానీకానికి భవభాందవులై
మమ్ము ఏలిన సత్కళా సంపన్నులు
మన పెద్దాపురం చైర్ పర్సన్ లు
















                                                                                                                                                                    పెద్దాపురం సంస్థానం 1847 వరకూ వత్సవాయ సూర్యనారాయణ జగపతి బహదూర్ పాలన కొనసాగింది. 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ / జాన్ వాట్స్ కంపెనీ పెద్దాపురంను ఆక్రమించడం జరిగింది. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురంను రెవిన్యూ డివిజన్ చేసి మున్సబు కోర్టు నిర్మించారు. 1857 తిరుగుబాటు తర్వాత భారత దేశం లో కంపెనీ పాలన రద్దు చేయబడి 1858 నుండి బ్రిటీష్ రాజ్ ఆవిర్భవించింది. ఆ తరువాత కొంత కాలానికి 1902 లో బ్రిటీషు వారిచే "టౌన్ హాల్" నిర్మించబడి 1915 లో రాష్ట్రంలో నే రెండవ మున్సిపాలిటీ గా పెద్దాపురం ఆవిర్భవించబడింది. శ్రీ. వి. కె అనంత కృష్ణ అయ్యర్ మరియు శ్రీ. అభినవ పట్నాయక్ లు బ్రిటీషు గవర్నమెంటు వారిచే నియమించబడి 1915 నుండి 1918 వరకూ పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్ మెన్ లుగా వ్యవహరించగా వీరి అనంతరం బ్రిటీషు వారిచే నియమింపబడిన పెద్దాపురం వాస్తవ్యుడైన మొట్టమొదటి చైర్మెన్
శ్రీ పింగళి కృష్ణారావు పంతులు గారు (1918 – 1921)
శ్రీ గోలి పెద కొండయ్య గారు (1921 – 1924) పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు
శ్రీ గుర్రాల కృష్ణా రావు గారు (1924-1926)
శ్రీ ముప్పన చిన వీర్రాజు గారు (1926-1928)
శ్రీ చల్లా దొరయ్య గారు (1928-1931)
శ్రీ జనాబ్ ఇస్మాయిల్ ఖాన్ సాహెబ్ గారు (1931-1933)
శ్రీ నియోగి వెంకట సుబ్బారావు గారు (1933-1934)
శ్రీ గొల్లకోట వెంకట రత్నం గారు (1934-1936)
శ్రీ జనాబ్ M.A కరీం సాహెబ్ గారు (1938-1941)
శ్రీ ముప్పన చిన అంకయ్య గారు (1943-1947)
శ్రీ ముప్పన పెద వీరభద్ర రావు గారు (1947-1952)
శ్రీ చల్లా వెంకట రావు గారు (1952-1956)
శ్రీ ముప్పన రామారావు గారు (1956 – 1972 & 1981- 1986) వరుసగా 4 సార్లు పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై 1961-66 కాలానికి ఛాంబర్ చైర్మెన్ గా ఏకగ్రీవం గా ఎన్నిక కాబడి ఇప్పటి వరకూ ఎక్కువ కాలం చైర్మన్ గా చేసిన వ్యక్తి గా గుర్తింపు పొందారు.
శ్రీమతి తాళ్ళూరి గంగా భవాని గారు (1987-1992)
శ్రీమతి బచ్చు శ్రీదేవి గారు (1995-2000)
శ్రీమతి ముప్పన శ్యామలాంబ గారు (2005-2010)
శ్రీ రాజా వత్సవాయ సూరిబాబు రాజు గారు (2000 – 2005 & 2014 - ) రెండవ సారి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు
దినదిన ప్రవర్ధమాన మవుతూ నానాటికీ విస్తరిచబడుతూ నేటికి 28 వార్డులకు చేరుకున్న మన పెద్దాపురం మున్సిపాలిటీ మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని పేదప్రజారహిత పెద్దాపురం కావాలని ఆకాంక్షిస్తూ ... మీ వంగలపూడి శివకృష్ణ
గమనిక: పైన ఉదహరించిన వాటి మద్య కాలాలలో ఏదేని కారణం చేత చైర్మన్ ఎన్నికలు నిర్వహించనప్పుడు ఆర్ డి. ఓ గారు గానీ జాయింటు కలక్టరు వారు గానీ లేక ఇతర అధికారులెవరైనా కానీ పురపాలకం నిర్వాహక భాద్యతను చేపట్టడం జరుగుతుంది దీనినే “స్పెషల్ ఆఫీసర్” పాలన గా వ్యవరిస్తారు.

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...