Thursday 26 November 2015

తొలితిరుపతి - THOLI TIRUPATHI SRI SRUNGARA VALLABHA SWAMI TEMPLE - PEDDAPURAM

తొలితిరుపతి - - మనపెద్దాపురం - చదలాడ తిరుపతి



తొలితిరుపతి - - మనపెద్దాపురం - చదలాడ తిరుపతి
శృంగార వల్లభుని - స్వర్ణ రథ కాంతి
తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి
అయితే తూర్పు గోదావరి జిల్లాలోని మన పెద్దాపురం లోనే తిరుపతి వుందని

అదే తొలితిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు .. మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర వుందని ) చాలా మందికి తెలియదు.




విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు ..
స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి





ఆలయ చరిత్ర :
--------------

ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో

ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.

అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా

ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.

ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట.

అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట

ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట

స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)

ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం)





ఆలయ విశిష్టత :
------------------
1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం )

2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది )

3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి

4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి.

5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది.

6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ





కార్యక్రమాలు - పూజా విధానం :
------------------------------
1) నిత్య ధూప దీప నైవేద్యం
2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం
3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు
4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.


చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు :
----------------------------------------------------
బోజమహా రాజు
బట్టీ విక్రమార్క
రాణీ రుద్రమదేవి
శ్రీ కృష్ణ దేవరాయలు
పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు

లక్ష్మీ నర సాపురం రాజులు ( లక్ష్మీ నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనం లోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి .. బసకి సరైన సదుపాయాలు లేవు అని స్తానికులు బాధపడుతున్నారు )

https://plus.google.com/+vangalapudisivakrishna/posts

వంగలపూడి శివకృష్ణ

వణికించిన - వింత జంతువు మరణ మృగం - STRANGE CREATURE IN PEDDAPURAM

మన పెద్దాపురం : మరణ మృగం



వణికించిన - వింత జంతువు
మొర్రెల మెకం - మరణ మృగం
ఓ స్త్రీ రేపురా - నరరూప రాక్షసులు

మీకు గుర్తుందా గురూ నేనైతే మర్చి పోలేను .......


పెద్దాపురం పరిసర ప్రాంతాలను భయబ్రాంతులని చేసిన భయంకర ఘటన
1990 - 1992 ఓ స్త్రీ రేపురా అంటూ రక్తపుటక్షరాలు తలుపులపై రాసుకున్న జనం
1997 - 2000 నరరూప రాక్షసుల రక్త దాహం
2003 – 2004 మరణ మృగం వింత జంతువు సంచారం - ఆడవారిపైనే దాడి -




ప్రత్యక్ష బాదితులు పదిమందికి పైనే
పరోక్ష బాధితులు పెద్దాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ
కాద్రా... కాష్మోరా అంటూ తులసీ దళం కదలు ఊరూరా ప్రచారం
మేము చూసామంటే మేము చూసామంటూ వివిధ రకాల గుర్తులు
ఒకరు సింహం లా వుంది అని
మరొకరు సింహం శరీరం సింధువు ఆకారం మొసలి చర్మం తోడేలు బుర్ర రెండుకాళ్ళతో నడుస్తుంది కావాల్సి నప్పుడు ఎగురుతుంది అని రోజుకో పుకారు షికారు




అంతా పుకార్లే కట్టు కదలే అందామంటే
ప్రత్యక్షంగా గాయపడ్డ ప్రజలు వాళ్ళ గాయాలు ఇస్తున్న సాక్షాలు
పెద్దాపురం వాసుల తాత్కాలిక వలసలు
రెండాట సినిమాలు రద్దు
చుట్టూ పక్కల పల్లె గ్రామాల వారు, పాల వ్యాపారులు గుంపులు గానే రాక పోకలు సాగించేవారు
పట్టణంలో దుకాణాలన్నీ 7 గంటలకే బంద్
విద్యార్ధులకి ప్రయివేటు క్లాసుల్లేవు
రోడ్డ్లన్నీ నిర్మానుష్యం
పోలీసులకి పుల్ గా పని
పెట్రోల్ అంతా పెట్రోలింగ్ కె వినియోగం
మంత్రగాళ్ళకి జేబునిండా కాసులు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
మనుషులకు - మంత్రాలూ
పిల్లలకూ - పశువులకు సాంబ్రాణీ పొగలు
ఇంటిముందు - చెరువులోన ఎర్ర నీళ్ళు పచ్చడి ముద్దలు
రోడ్డు మీద వూరు చివర
దిష్టి గుడ్లు - గుమ్మడి కాయలు
అటవీ శాఖ అధికారుల హడావుడి
కత్తులు బల్లాలతో కుర్రాళ్లు
కారాలు మిరియాలుతో ఆడాళ్ళు
ప్లాన్లు పధకాలతో పెద్దాళ్ళు
మేక మాసం ఎర
మరణ మృగానికి చెర
వింత జంతువుతో ఒక్కరికీ ఒక్కొక్క అనుభవం
వెన్నులో దడ పుడుతున్నా
వదనంలో ధీరత్వం
మేక వన్నె పులులు కాదు -
పులివన్నెల మేకలు
అయినా ............................................................. ?

ఇవి కధలా………
కలలా………………..
పుకార్లా…………. లేక

వీటి వెనుక ఏదైనా గూడు పుటాని ఉందా….. ! నాకైతే తెలియదు కానీ అదొక గొప్ప అనుభవం ( A Great memory )

Pictures placed here are just Representing thoughts of victims but nothing -

మీ వంగలపూడి శివ కృష్ణ

మన పెద్దాపురం మొట్టమొదటి M.L.A - దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు - 1st MLA of PEDDAPURAM

మన పెద్దాపురం మొట్టమొదటి M.L.A - దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు

-------------------------------------------------------------------------------------

జననం : 10-05-1911 విద్య : బి. ఎ - ఎల్ ఎల్ బి

న్యాయ వాది గా పనిచేస్తూ అమలాపురానికి పబ్లిక్ ప్రాసిక్యుటర్ గా నియమితులయ్యారు.

బ్రిటీషు వారి అరాచకాలకు సహించలేక తన పదవికి రాజీనామా చేసి భారతదేశం నుంచి బ్రిటీష్ పాలనను తరిమివేయటమే లక్ష్యంగా 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకొన్నందుకు గానూ 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు.

ఆయన యొక్క న్యాయవాద పట్టబద్రుని పట్టా రద్దు కి కేసు వేయబడగా పోరాడి సాదించుకొన్నారు. కేసు కొట్టి వేయబడింది స్వాతంత్ర్యానంతర పరిణామాల వల్ల కలత చెందిన దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానాల పై విసుగు చెంది 1949 లో తన భావాలతో సారూప్యత కల్గిన కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు.

1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట రామస్వామి పై ఓటమి చవిచూశారు.

1953 లో ఆంద్ర రాష్ట్రావతరణ ప్రకటన వెలువడింది 1956 లో ఆంద్ర రాష్ట్రం అవతరించిది అన్న విషయం తెలిసిందే కదా .... ?

1955లో పెద్దాపురానికి దూర్వాసుల వెంకట సుబ్బారావు (సి.పి.ఐ = కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేసి సమీప ప్రత్యర్ది చల్లా అప్పారావు (కె ఎల్ పి = కిర్లావాలా లిబరల్ పార్టీ) పై విజయం సాధించారు. ఆయన పదవీ కాలంలో అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసారు కార్మిక కర్షక ప్రగతి కామికులగా పెద్దాపురానికి మొదటి మండల లెజిస్లేటివ్ అసెంబ్లీ (ఎం. ఎల్. ఎ) గా సేవలందించారు.

తప్పులుంటే క్షమించాలి ............................... మీ వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...