Wednesday 17 February 2016

Pandava Caves Peddapuram - పెద్దాపురం పాండవుల మెట్ట

పెద్దాపురం పాండవుల మెట్ట


ఆంధ్రుల అంతః పురమై అలరారిన అమరగిరిలో
చీకటి గుహల చెంత సూర్యుని సన్నిది 
భీముని పాదముద్ర గుహలో పాండవుల నిద్ర
ద్రౌపది మైల నేల నలభీముల పాకశాల

పుట్టిన ప్రతి బిడ్డకు పేరెట్టగ చెంచులు
మొక్కులు తీర్చగ మన్నెం మారాజులు
కళాకారుల వేల గొంతుల చేత 
కళావంతుల కాలి గజ్జెల మోత

వర్షాబావంలో వరదపాశ ఉత్సవం 
ఏటా మాఘంలో ఉజ్వల రధోత్సవం 
చుట్టూ చెట్ల నడుమ నూటేమ్మిది మెట్లు
నయనానంద మయిన ఆలయాల మిరుమిట్లు



















పూర్వ చరిత్ర : ద్వాపర యుగంలో కౌరవుల చేతిలో మాయా జూదం లో ఓడిపోయిన పాండవులు. పందెంలో షరతు ప్రకారం, పన్నెండేళ్ళ వనవాసాసం, మరియు ఒక సంవత్సరం అజ్ఞాత వాసంలో గడపాలి. 12 ఏళ్ళ వనవాసం భారతదేశం లోని వివిధ ప్రాంతాలలోనూ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాత వాసం విరాట రాజు కొలువులో గడిపారని వనవాస సమయంలో పాండవులు దట్టమైన అరణ్యాలలో ఎత్తైన ప్రాంతాలు వెతికి అక్కడ నివాస యోగ్యం గా రాతితో/పెద్ద బండ రాళ్ళతో గుహలు నిర్మించుకొన్నారని వంట చేసుకోవడానికి అనుగుణంగా వంట శాలలు నిర్మించుకున్నారని ఇందులో బాగంగానే పెద్దాపురం లోని పాండవులు ఈ మెట్ట పై నివసించారని ప్రతీతి.
పాండవుల మెట్ట మీద ప్రత్యేకతలు అరుదైన విషయాలు:
ఆలయాల కలబోత - పెద్ద పెద్ద ముళ్ళ పొదలతో బారీ వృక్షాలతో నిండి పోయిన ఈ మెట్ట పై రాజయోగి పంచ ప్రణవనాద శ్రీ పాలూరి వెంకట సుబ్బారావు గారు అకుంఠిత దీక్షతో 1952లో సూర్యనారాయణ స్వామి దేవాలయం నిర్మించారు తరువాత ఈ క్షేత్రం దినదినాబి వృద్ది చెందుతూ ఇప్పుడు సకల దేవతా సమ్మేళనం గా విరాజిల్లుతుంది : 108 - అష్టోత్తర మెట్లెక్కి మెట్ట చేరితే అన్నీ ఆలయాలే - విఘ్నేశ్వరాలయం, వేద గాయత్రీ మాత ఆలయం, నవగ్రహలలోని రాహు, కేతువు, చంద్ర మరియు శనీశ్వర ఆలయాలు శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వరాలయం, వలీ సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరీ సమేత శివాలయం, సంతోషి మాత ఆలయం, కృష్ణా లయం, భీముని పాదాల ఎదుట హిడింభీ దేవి గుడి మెట్ట క్రింద బాగంలో ద్యాసాంజనేయ స్వామి వారి ఆలయం ఒక వైపు, అమరగిరి సత్తెమ్మ వారి ఆలయం మరో వైపు సందర్శకులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేస్తాయి
ప్రకృతి రమణీయత
పెద్దాపురం మొత్తాన్ని ఒక్క సారిగా చూడాలంటే పాండవుల మెట్ట ఎక్కాల్సిందే. 
గుహ ఎంట్రన్స్ పై భాగం నుండి సూర్యోదయం, 
భీముని పాదాలు దగ్గర నుంచి సూర్యాస్తమయం 
నిండు పున్నమి రోజు రాత్రి ఆకాశం 
కటిక అమావాస్య రోజు రాత్రి విద్యుత్ దీపాల వెలుతురు లో పెద్దాపురం ఊరు

గుహలు : మెట్ట మీద గుహలు ప్రత్యేక ఆకర్షణ పాండవుల గుహలు భారత దేశంలో తుంగనాథ్ - ఉత్తరాఖండ్,
మహాబలిపురం - తమిళనాడు,
ఘట్శిల్ - జార్ఖండ్,
మంగళూరు - కర్నాటక,
నాశిక్ - మహారాష్ట్ర,
పచంరాహి & పన్నా - మధ్యప్రదేశ్,
విరాట్ నగర్ - జైపూర్, 
గోవా - గోవా 
మన ఆంద్రప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి తూర్పుగోదావరి జిల్లా లోని "పెద్దాపురం" లో ఉంటూ మహా బారత చరిత్రకు సాక్ష్యాలు గా నిలిచాయి.

పెద్దాపురం లోని గుహలు 
ఈ గుహలు ఎప్పటికీ ఒక మిస్టరీనే ఈ గుహలో పాండవులు నివశించారని ఈ గుహల ద్వారానే రాజమహేంద్రవరం గోదావరీ స్థానానికి తెల్లవారు జామునే బయలుదేరి సూర్యోదయానికల్లా తిరిగి వచ్చేసే వారని వీరి అనంతరం ఆ గుహలు రాక్షసులకు నివాసం గా మారిందని ఆది శక్తి అంశ రాక్షస సంహారం కావించి ఋషులకు మహర్షులకు తపో ప్రదేశం గా మార్చిందని కలియుగంలో ఈ గుహ వింత జంతువులకు విష సర్పాలకు, తోడేళ్ళకు ఆవాసం గా మారిందని కధనం (నిజా నిజాలు శ్రీ సూర్య నారాయణునికే ఎరుక). ఇటీవలి కాలంలో గుహ అంతా గబ్బిలాలతో నిండి ఉండి గబ్బు వాసన వచ్చి సందర్శకులు లోనికి వెళ్ళలేక పోయేవారు ఇప్పుడు గబ్బిలాలు ఏమి లేవు ఎవరైనా గుహ చివరి బాగం వరకూ వెళ్లి చూడవచ్చు. ఈ గుహలను సందర్శించడానికి అనువుగా రోడ్డు నుండి కొంత దూరం మేర వాహనాల మీద వచ్చి అక్కడ నుండి 63 మెట్ల సాయంతో చేరుకోవచ్చు).

పాండవుల పాకశాల (వంటశాల) : భీముడు బోజన ప్రియుడే కాదు షడ్రుచోపేతమైన వంటలు బహుపసందుగా చేయడంలో అందే వేసినచేయి గుహకు అతి దగ్గరగా చిన్న గుహ మాదిరిగా రాతిని వొలిచిన ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ పాండవులు భోజనాల తయారీకి వాడుకున్నారని చారిత్రక కథనం. ఈ ప్రాంతంలో కనిపించే డొప్ప వంటి భాగాన్ని గంజి వార్చే భాగము' గా వర్ణిస్తారు..
ద్రౌపది రజస్వల చాప
పాండవుల పాకశాల గుహల ప్రక్కనే చతురస్రాకారంలో చాప మాదిరి రాతి నిర్మాణం కనిపిస్తుంది.సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు బహిస్టు సమయంలో గృహ సంబంధిత కార్యక్రమాలకు దూరంగా వుంటారు ఆచార సంప్రదాయాలను అత్యంత నిష్టగా పాటించేవారు నేటికీ బహిష్టు రోజులను అపవిత్ర రోజులుగా భావించి వేరుగా ఏదో మూలన గృహ కార్యక్రమాలకు దూరంగా గడపడం జరుగుతుంది. ఆ దినములు గడిచిన తర్వాత మంగళకర స్నానం ఆచరించి గృహ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆచారంగా వస్తోంది. 
సాధారణ వయసులో సంభవించే రజస్వల సంభవించని ఆడపిల్లలను పాండవుల మెట్ట ఈ ద్రౌపది రజస్వల చాపవద్దకు తీసుకువచ్చి దానిపై కూర్చుండబెడితే వారు రజస్వల అవుతారన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది.

రిపీటర్ టవర్ : తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం పెద్దాపురం అలాంటి ఒక పెద్దాపురం లో పాండవుల మెట్ట దాదాపు 200 అడుగుల ఎత్తు ఆ మెట్ట మీద రెండు టవర్ లు ఒకటి రెవిన్యూ రెపీటర్ టవర్ & పోలీస్ కమ్యూనికేషన్ టవర్ వాటి ఎత్తు దాదాపు 150 అడుగులు ఇలా ఆంద్ర రాష్ట్రానికే అత్యంత ఎత్తులో ఉన్న ఈ టవర్ పరిధి రాష్ట్రం అంతటా వ్యాపించి వుంది. ఒకప్పుడు ఇక్కడ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం మకాం వేసుకుని వుండేది
వరద పాశ ఉత్సవం : సకాలంలో వర్షాలు కురవకపోతే పట్టణంలోని అన్ని వీధులకు చెందిన రైతులు పాండవుల మెట్ట పై వరదపాసం నిర్వహిస్తారు. పట్టణంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, అధికంగా నివసించే ప్రాంతాలవారు కోడెగిత్తలను, ఆంబోతులను అలకరించి భజనలు చేస్తూ, పాటలు పాడుకుటూ పాండవుల మెట్టపైకి ఊరేగింపుగా వెళ్లి మెట్టపై పాలు పొంగించి పరమాన్నం వండి వరుణ దేవుడికి నైవేద్యం పెడతారు.
సుద్దకొండలో క్షుద్ర పూజలు (నిధుల అన్వేషణ) 
పాండవుల మెట్ట మరియు సమీపం లోని గవ్వల మెట్ట, పైరింగ్ మెట్ట మరియు పాత పెద్దాపురం కోటముందు సమీపంలోని చిన్న మెట్ట అంతా సుద్దతో నిండిన ప్రాంతాలు కావడం వల్ల సుద్ద త్రవ్వకాలు జోరుగా జరిగేవి - రాజులు నివసించిన ప్రాంతం కావడంతో అడపా దడపా కొన్ని చోట్ల బంగారు నాణేలు దొరికాయన్న వదంతులు వ్యాపించడంతో నేటికీ కొంతమంది గుప్త నిధుల అన్వేషణ కావిస్తూనే వున్నారు మూఢ నమ్మకాలతో పిచ్చి పిచ్చి పూజలు (క్షుద్ర పూజలు) చేయిస్తూ సుద్దకొండను త్రవ్వుతూ చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు

జరిగే కార్యక్రమాలు :
నిత్య దర్శనం 
మాఘ మాసం 30 రోజులు విశేష పూజలు - భక్తుల గోత్ర నామాలతో అర్చనలు.
రధసప్తమి వేడుకలు సూర్య నారాయణ స్వామి వారి కల్యాణం 
ప్రతీ శివరాత్రికీ స్వామీ వారికి మహా రుద్రాభిషేకం, లక్షబిళ్వార్చన .
వర్షాలు కురవని సమయాలలో వరద పాశ ఉత్సవం

తప్పకుండా ఈ దివ్య క్షేత్రాన్ని దర్శిస్తారని ఆశిస్తూ....... మీ వంగలపూడి శివకృష్ణ

Kattamuru A Beautiful Village in Peddapuram Consistency పెద్దాపురం సంస్థానం కట్నం - వూరు "కట్టమూరు"

పెద్దాపురం మహారాజా వారు శ్రీ రామునికి కట్నం గా సమర్పించిన వూరు కట్టమూరు


 వర్ణించ తరమా ఈ వూరి సొగసులు 
ఏలేరు వంపులు 
పచ్చని పైరులు 
పైరులకి కొలనులు 
పశువులకు చెరువులు
ఊరి మద్యలో జోడుగుళ్ళు 
ఊరి నిండా పెంకుటిల్లు 
కల్మషం లేని మనుషులు









పెద్దాపురం మహారాజా శ్రీ రాజా రాయపరాజ మహారాజు గారు(1607-1649)

శ్రీ రామునకుఁ కట్టమూరున గట్టించే గుళ్ళూ గోపురములు మంటపములు,
గంభీర జల తటాకమును త్రవ్వించె గృహస్తపురంబున సుస్థిరముగఁ
బొలుపుగా వాల్మీకిపురి కాండ్రకోటను ఫలభూజవాటికల్ పదిలపరచే"

అని ఏనుగు లక్ష్మణ కవి రచించిన రామ విలాసము లో ఇలా వర్ణించాడు

గుడులు గోపురములు : 
పట్టాభిరాములవారి గుడి మరియు కేశవ స్వాములవారి గుడి, శివాలయము, వినాయకుని గుడి, షిరిడి సాయిబాబావారి దేవాలయము, వీరబ్రహ్మం గారి ఆలయము, ఊరి మొదట్లో కనకదుర్గ గుడి, ఊరి చివరన పోలేరమ్మ తల్లి ఆలయము, ఇంకా శ్రీరాముని కోవెలలు, ఆంజనేయుని గుడులు కలవు.

చెఱువులు : 
మంచి నీటి చెఱువు, రాయన చెఱువు, బాపనవీధి చెఱువు, కిత్తా చెఱువు, గంగరావి చెఱువులు

పాఠశాలలు : 
ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మూడు మండల ప్రజా పరిషత్ పాఠశాలలు

Anivilla Venkata Sastry - of Peddapuram Pricely State పెద్దాపురం సంస్థానం - శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి

శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి - ’చిత్ర చమత్కార మంజరి ‘’ని పెద్దాపురం మహారాజుా వత్సవాయి తిమ్మ జగపతి రాజు గారికి కి అంకితమిచ్చారు.



పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్తికి చెందిన ఆణివిళ్ళ నారాయణ కవి కుమారుడే ఆణివిళ్ళ వేంకట శాస్త్రి. ఈయన 18 వ శతాబ్దానికి చెందినవాడు. బాల కాళిదాస బిరుదాంకితుడైన శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు సర్వ శాస్త్ర పారంగతుడు సకల శాస్త్ర వైదుష్యం ఉండటం చేత పెద్దాపురం సంస్థానం మహా ప్రభువులు, దార్లపూడి, విజయనగర మహా రాజుల చేత గొప్ప సన్మానాలు పొందాడు .
’’మహేశ్వర మహా కావ్యం ,
సతీ స్తోత్రం ,
భాస్కర ప్రశస్తి ,
రుక్మిణీ పరిణి కావ్యం రాశాడు .
వేంకట శాస్త్రి గారు గొప్ప అలంకారికులు
’’అలంకార సుధా సింధు ‘’,
’’రస ప్రపంచం ‘’ఆతని శేముషికి నిదర్శనాలు . ‘’చిత్ర చమత్కార మంజరి ‘’ని పెద్దాపురం రాజు వత్సవాయి తిమ్మ జగపతి కి అంకితమిచ్చాడు .చిత్ర కవిత్వముగా ‘’సూర్య శతకం ‘’రాసాడు. . శ్రీ ఆణివిళ్ళ వేంకటశాస్త్రి గారికి వార్ధక్య దశలో పెద్దాపురం సంస్థానం వారు అగ్రహారం ప్రసాదించాలని సంకల్పించగా అప్పటి మంత్రి పాణంగిపల్లి రామచంద్రుడు గారి కుతంత్రము వల్ల నెరవేరలేదట.... పాణంగిపల్లి రామచంద్రుడు తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలానికి చెందిన పాణంగిపల్లి, గ్రామము ను అగ్రహారంగా పొందే నిమిత్తం అలా చేసాడని లోకోక్తి.
నూజివీడు జమీందారులు మేక వెంకట నరసింగ అప్పారావుపై ‘’అప్పారాయ యశశ్చంద్రో దయ కావ్యాలు రాసాడు. మెచ్చిన రాజు వల్లూరుమల్లి అగ్రహారాన్ని ప్రదానం చేసాడు. అక్కడ సోమయాగం చేసాడు. “శ్రౌత సూత్రాలు” పై భాష్యమ్ రాసాడు

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...