Friday 27 November 2015

పెద్దాపురం మరిడమ్మ తల్లి - PEDDAPURAM MARIDAMMA THALLI JAATHARA VISESHALU

పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర విశేషాలు : 

17 వ శతాబ్దములో పెద్దాపురంలో మానోజి “ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవత గా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిసారు
17 వ శతాబ్దములో ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడివి గా వుండేధి. ఒక సారి ఆ అడవులో పశువుల కాపరులకి “ 16 ఏళ్ల యువతి కనిపించి “ నేనుచింతపల్లి వారి ఆడపడుచుని . నేను ఈ ప్రదేశములో వున్నాను అని మా వాళ్ళకి చెప్పండి . “ అని చెప్పి అంతర్థానము అయ్యింది ..............................

ఈ వింతను చూసిన పశువుల కాపరులు వెనువెంటనే చింతపల్లి వారికి జరిగింది అంతా చెప్పారు... ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ “ మానోజి “ చెరువు దగ్గరకి వొచ్చి చుట్టూ ప్రక్కల ప్రాంతములు వెతకగా ................ !

వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతి రూపము దర్శనమిచింది . .. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్టించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప ధీప, నైవేధ్యములు చెల్లించి ఆరాధించటము ప్రారంభించారు.

ప్రతీ సంవత్సరము ఆషాఢ మాసము లో నెల రోజుల పాటు ఈ మరిడమ్మ అమ్మ వారి జాతర ఎంతో వైభవము గా జరుగుతాది .కాని ఈ సంవత్సరం 2015 అధిక ఆషాడ మాసం, అపురూప గోదావరిపుష్కరాలు సందర్భంగా 67 రోజుల పాటు జాతర జరుగును .
రాష్ట్ర నలుమూలల నుండి మరిడమ్మ అమ్మ వారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూంటారు ఒక్క ఆది వారం రోజునే దాదాపు 40 నుండి 50 వేల మంది వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారని ఆలయ కమిటీ సమాచారం.............................. 
పూర్వం కలరా లాంటి భయంకర వ్యాధుల నుండి .. ఆ గ్రామ ప్రజలను రక్షించే అమ్మవారుగా ఎన్నో మహిమలు చూపించింది . పిలిస్తే పలికే ఈ అమ్మవారిని చుట్టుప్రక్కల గ్రామాల వారు కులదైవము గా ఆరాధిస్తారు
ఈ విషయం మీ అందరికీ సుపరిచితమే……….................... !
* అయితే మీరు తప్పని సరిగా తెలుసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయాలు ...... ఎన్నో*** .................................. !
మరిడమ్మ జాతర జేష్ఠ మాసం లోని అమావాస్య నుండి ప్రారంభ మై ఆషాడమాసం లో ని అమావాస్య వరకూ ముప్పై ఒక్క రోజులు జరుగుతుంది……


**ఉయ్యాల తాడి **
=============
జేష్ఠ మాసం లోని అమావాస్య నుండి ప్రారంభ మై ఆషాడమాసం లో ని అమావాస్య వరకూ ముప్పై ఒక్క రోజులు జరిగే ఈ జాతరలో భాగంగా…… సరిగ్గా బహులైక జేష్ఠ అమావాస్యకు పక్షం (పదిహేను రోజులు) ముందు అమ్మ వారికి ఉయ్యాల తాడిని వేస్తారు....
జాతర రోజు నుండి జాతర ముగిసే వరకూ అమ్మవారు మరియు ఆమె ఆడపడుచు లు అక్క చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనలు చూస్తారని భక్తుల విశ్వాసం….
ఈ ఉయ్యాల తాడిని రైతు లు వారి వారి పొలాల గట్లమీద ఏపుగా ఎదిగిన తాడి ని సమర్పించడాని కి ఎగబడతారు అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి 6 నెలల ముందుగానే చెప్పుకోవలసి వుంటుంది....
ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు 100 మంది కి పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మ్రోగుతుంటే ఆ తదుపరి గరగలు నడుస్తూ వుంటే దారిపొడవునా గ్రామ ప్రజలు ఆడపడుచులు తాడిలకు స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోటముందు మీదుగా గుడివద్దకు సాగనంపుతారు ........................................................................................... 
(వారిని కాదని వేరొకరు తేలేరు ఆ దారి కాదని వేరొక దారి పోరాదు) 
అది వారి భుజాల మీదుగా ఆ దారి మీదుగానే గుడివద్దకు రావాలి అది అనాదిగా వస్తున్న ఆచారం ......................................................................................................

పెద్దాపురం లో మరిడమ్మ అమ్మవారు వెలసినప్పటి నుండీ జాతర నిర్వహించుచున్న ఒకే ఒక వీది ఏమిటో తెలుసా ..... ?
* పాత పెద్దాపురం కోటముందు *                           **తొలి జాతర**
తొలి జాతర (జాగారం) వీరిదే............... 
వీరు నిర్వహించేది జాగారం మిగిలిన వీధుల వారు నిర్వహించేది సంబరం ............. !
బహులైక జేష్ఠ అమావాస్య సాయంత్రం మొట్టమొదట జాతర గరగలు **గుడి వద్ద జాతర గరగలు కంటే ముందు** ఎత్తి అమ్మవారి సమక్షం లో గరగ నృత్యం ఒక ఆట పులి నృత్యం ( పులి ఆటకి రాష్ట్రము లోనే ప్రసిద్ది చెందిన పులి ఆటకారులున్నారిక్కడ ) ఒక ఆట ఆడి పాత పెద్దాపురం కోటముందు కి పయనమవుతారు

...... మిగిలిన కార్యక్రమం అంతా కోటముందు లోనే జరుగుతుంది ......
ఇది వరకూ ఈ వీది వారికి ఇంటికి ఒక ఎద్దుల బండి వుండేది .....ప్రతీ ఒక్కరు వ్యవసాయంతో పాటుగా ఇటుక బట్టీ వ్యాపారాలను నిర్వహించేవారు...................... వ్యవసాయక్షేత్రం ద్వారా వచ్చే గడ్డితో ఎద్దులను …........... ఎద్దులద్వారా మట్టి తొక్కించి ఇటుకల వ్యాపారాన్ని జరుపుకునేవారు ...... దాదాపు 30 ఎద్దుల బళ్ళుతో ఒక మైలు (సుమారు కిలోమీటరున్నర దూరం) వరకూ రక రకాల వేషాలతో అంగరంగ వైభవం గా కాగడాల కాంతుల్లో అద్భుత రీతి లో జరిగేది పాత పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మ వారి జాతర మహోత్సవం …...........................................................................


ఇక్కడ పెద్దాపురం కళాకారులు ప్రదర్శించే పాత పెద్దాపురం కోటముందు వాసుల పులి నృత్యం ... మాల మరిడీ సాముగరిడీలు… బంగారమ్మ గుడి వీధి వారి కర్రసాము…. కళావంతుల కోలాటాలను వీక్షించడానికి రాష్ట్రం నలుమూలలనుండీ ప్రేక్షకులు వచ్చేవారు.
అయితే… తాగుడు, భోగం మేలాలకు బానిసలైన సదరు వ్యాపారస్తులు కాలక్రమంలో అహంకార పూరితులై ఒకే ఒక్క సంవత్సరం సంబరాన్ని నిలిపి వేసారు……… ? ………………………………………………………………
అదే అదనుగా ఎప్పటి నుంచో తొలి జాతర గరగలు ఎత్తడానికి ప్రయత్నిస్తున్న ఒక అధిక వర్గం జాతర గరగల ను ఎత్తి తొలి సంబరం జరిపేసింది..... అంతే............................... !
* ప్రకృతి వైపరీత్యాల వాళ్ళ పాత పెద్దాపురం కోటముందు వారి వ్యాపారాలన్నీ నాశనం అయ్యిపోయి విపత్కర పరిస్థితులలో చిక్కుకున్నారు***.........
* కలరా వ్యాది ప్రబలి తొలి గరగలను ఎత్తిన వారి వీధి లోని చాలా మంది పాతిక సంవత్సరాలలోపు యువకులు చనిపోయారు పెద్దాపురం అంతా విషాదం అయోమయం ..........
........ఆర్ధికంగా అందరికీ గడ్డు కాలం దాపురించిది………
ఆ సంఘటన తరువాత కోటముందు వాసులు ఏనాడు జాతరను ఆపుచేయడానికి , వేరొక వీది వారు తొలి గరగలను ఎత్తడానికి సాహసించలేదు ....
**తినడానికి తిండిలేని కరువు పరిస్థితుల్లో కూడా వారు ఇళ్ళల్లో ఉన్న రాగి, ఇత్తడి వస్తువులను తాకట్టు పెట్టి * గరగలను * తల్లి వద్ద నుండి తీసుకు తెచ్చుకున్న సందర్బాలెన్నో** ...........……
చరిత్ర తెలియక ఇటీవల కాలం లో కొందరు తొలి గరగలను ఎత్తడానికి ప్రయత్నించి నప్పటికీ వారిని నిలువరించడానికి గుడి ప్రాంగణం లో చిన్నపాటి యుద్దమే జరిగింది. అయితే ఆ తరువాత వారి పెద్దల ద్వారా చరిత్ర తెలుసుకొని మరిడమ్మ తల్లి ఆలయ కమిటీ సలహా మేరకు వారే తగ్గి సుహ్రుద్బావ వాతావరణంలో జాతర జరిగేందుకు సర్వ సహకారాలు అందిచడం విశేషం.
ప్రస్తుత కాలం లో అంగరంగ వైబవంగా ప్రతి ఏడు జాతర జరుపుతున్న వీధులు వరుసక్రమంలో .....
* చేపల వీది (మత్స్యకారులు దాదాపు ఒక్కరోజు జాతరకు 2 లక్షల నుంచి మూడు లక్షల వరకూ వెచ్చిస్తారు) ఈ వీధి జాతరలో కొత్త కొత్త కార్యక్రమాలకు బాణా సంచా మోతలకు పెట్టింది పేరు
***పాసిల వీధి : ***కుమ్మరి వీధి : చేపల వీధి తో పోటీ గా జాతరను నిర్వహించగల సామర్ద్యం మరిడమ్మ తల్లి గుడి కి అతి దగ్గరగా కన్నుల విందు
***కొత్తపేట (రెండు జాతరలు), చిన పాసిలవీది, వ్యాపారపుంత, బంగారమ్మ గుడి వీది, ***నువ్వుల గుంట వీధి, కబడ్డీ వీధి, రెల్లి వీధి, మూలా పేట,....................................... ఇలా దాదాపు 18 జాతరలు నెల పొడవునా జరుగుతాయి.......... 
........................................................................* ఇంకా సరిదిద్దాల్సింది వుంది *
.............................................................. ఇట్లు మీ వంగలపూడి శివ కృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...