Monday 18 January 2016

లూథరన్ హైస్కూలు - Luthern High School Peddapuram - L.H.S Peddapuram

మన పెద్దాపురం లూథరన్ హైస్కూలు 


వంద సంవత్సరాల ఈ స్కూలు
నిరంతర విద్యాప్రగతికి ఆనవాలు
పెద్దాపురం లూథరన్ హైస్కూలు
స్థాపించిన ఎడ్మన్ ఇమ్మానుయెల్ కి జేజేలు
ఈ స్కూలు పేరు పేరు చెప్తే పులకించే పూర్వ విద్యార్ధుల సాక్ష్యం
శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును అనే భవనం మీద వాక్యం.
కోత పండుగ
క్రిస్మస్ వేడుక
కళా వేదిక
క్రీడా కూడిక
'H' ఆకారం భవంతి
గాలికి వేళ్ళాడే స్కెలిటన్
పీటర్ మాస్టారి ఫుట్ బాల్ అసోసియేషన్ ….

ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో మదుర స్మృతులు ఇక్కడ చదివిన విద్యార్థులకే కాదు పెద్దాపురం లోని ప్రతి విద్యార్ధికీ ……………………… ఇలా


పెద్దాపురం చరిత్ర లో చెరగని ముద్ర వేసి తనకో పేజీ లిఖించుకొని ఎందరో విద్యార్ధులకు అశాదీపం అయిన లూథరన్ హైస్కూల్ చరిత్రలోని కొన్ని మైలు రాళ్ళు మీకోసం …….



అక్షరాస్యతా శాతం లో అట్టడుగు స్థాయిలో ఉన్న పెద్దాపురాన్ని విద్యాపురంగా వెలుగొందించాలన్న ఆశయంతో ఎడ్మన్ మహాశయుడు (Dr. Edman Emmanuel. M.D డా \\ ఎడ్మన్ ఇమ్మానుయెల్ ఎం డి) 1891 లో ఒక ఇల్లు ని అద్దెకి తీసుకుని ప్రైమరీ స్కూల్ ని స్థాపించడం జరిగింది.

ఆ తరువాత రెవ హెచ్ ఇ. ఇసాక్సన్ H.E. Isaac-son గారు 1897 లో స్కూలుని నాలగవ తరగతి వరకూ పెంచగా....!

శ్రీ మద్దిరాల రామారావు పంతులు గారు లూథరన్ హైస్కూలు మొట్టమొదటి హిందూ మరియు భారతీయ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఘనత వహించారు.

16-02-1900 సంవత్సరం లో ప్రభుత్వ గుర్తింపు పొంది 475 మంది విద్యార్ధులు మరియు 18 మంది గురువులతో పూర్తి స్థాయి విద్యాలయంగా ఆవిర్బవించింది. (ఒక మిషినరీ స్కూల్ లో టీచర్స్ అందరూ హిందువులే కావడం గొప్పవిషయం)

రెవ కె ఎల్ వాల్టర్స్ (Rev. K.L. Walters) గారు ఈ స్కూల్ కి 6 ఎకరాల స్థలమును సంపాదించి ఇవ్వగా 1906 లో ఇప్పటి బ్రాంచి స్కూలు ఉన్న ఒక భవనం ను కొని దానికి మరమత్తులు - మార్పు లు చేర్పులు చేయించడం ( రీ మోడలింగ్) స్కూల్ మిషనరీ నుండి మిషన్ కౌన్సిల్ కి మార్పు చెందడం వడి వడి గా జరిగి పోయాయి.


పాఠశాల భవనం నిర్మించేందుకు 25.11.1911 న శంఖుస్థాపన చేసి 29.10.2012 నాటికి H - ఆకారంలో వుండే ఒక బారీ భవంతిని రూ. 38000/- వ్యయంతో నిర్మించడం జరిగింది. (ఈ స్కూల్ నిర్మాణానికి కావాల్సిన రూ 38000/- డబ్బు కోసం "రెవ హుస్స్" (Rev Huss - మహాశయుడు తనకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భూమిని అమ్మి ఇవ్వడం జరిగింది.)

రెవ హెచ్ హెచ్ సిపెస్ (Rev. H.H. Sipes) గారు ఈ స్కూలు కి మొట్టమొదటి మేనేజర్ గా 1912 నుండి 1917 వ సంవత్సరం వరకూ సేవలందిచగా.



First Ncc Officer of Luthern High School Mr. Rudra Raju

1932 శ్రీ వి సి హెచ్ జాన్ గారు మొట్టమొదటి ఇండియన్ మేనేజర్ గా ఘనత వహించి 1936 లో ఈ స్కూలు యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకను ఘనంగా నిర్వహించారు.



1945 లో శ్రీ ఎ డానియెల్ గారు ప్రధానోపాధ్యాయులు గా ఉన్న కాలాన్ని పెద్దాపురం లూథరన్ హై స్కూల్ కి స్వర్ణ యుగం గా చెప్పవచ్చు 55 మంది టీచర్స్ , 768 విద్యార్ధినీ - విద్యార్ధులు మరియు స్కూలుకి చేర్చి ఉన్న భవనంలో 87 మంది విద్యార్ధులతో స్కూలు కళకళలాడిపోయేది.




1954 నుండీ 1965 వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన ఎం ప్రకాశం గారు స్కూలుని కేవలం విద్యకే పరిమితం చేయకుండా (ఎక్ష్రా కర్రిక్యులర్) - క్రీడలు - కళలు కి కూడా సమాన ప్రాధాన్యాన్నిచ్చి విద్యార్ధులు అన్ని రంగాలలోనూ నిష్ణాతులయ్యేలా ప్రోత్సహించారు.


ఆ ప్రయత్నం లో భాగంగానే అల్ ఇండియా జమ్బోరీ - (స్కౌట్) ని 1964 వ సంవత్సరంలో స్కూల్ కి తీసుకురావడం - స్కూల్ కి ఒక జెండాను రూపొందించడం - శ్రీ అర్. సూర్యనారాయణ గారు ( ఆర్ట్ & స్కౌట్ టీచర్) గారిచే స్కూలుకి ఒక గేయాన్ని రచింప చేయటం ( స్కూల్ సాంగ్) జరిగింది.


శ్రీ బి శామ్యూల్ గారు 1967 నుండి 1976 సంవత్సరం వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి స్కూలు కి నాచురల్ సైన్స్ లాబోరేటరీ ని నిర్మించి డైమండ్ జూబ్లీ వేడుకలను 1975 సంవత్సరం లో ఘనంగా నిర్వహించారు.


1978 నుండి 1991 వరకూ వి ఎస్ డేవిడ్ రాజు గారు ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి అదనపు సెక్షన్స్ ను ఉద్యోగులను నియమించి సుదీర్ఘ కాలం స్కూలుకి సేవలందించిన వ్యక్తిగా గుర్తింపు పొందడం జరిగింది.


1991 నుండి 1994 వరకూ జాన్ పీటర్ గారు ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహించడం జరిగింది. పీటర్ గారు స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడే ఫుట్ బాల్ అసోషియేషన్ ను స్థాపించి విద్యార్ధులకి విద్యార్ధులకి శిక్షణ ఇచ్చేవారు. ఈయన హయాం లోనే 1992 లో సెంటినరీ ఇయర్ అఫ్ లూథరన్ హైస్కూలు ని ఘనంగా నిర్వహించి స్కూలు స్థాపకుడు అయినటువంటి డా ఎడ్మన్ ఇమ్మానుయెల్ గారి విగ్రహం స్కూలు ఆవరణలో ఆవిష్కరించడం జరిగింది.




1995 నుంచి 1998 వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన ఎం శ్యాం సుధాకర్ గారు (ఎం. ప్రకాశం గారి తనయుడు) లూథరన్ బ్రాంచ్ ని లూథరన్ హై స్కూలుని క్లబ్ చేసి విద్యార్ధుల సౌకర్యార్ధం అదనంగా స్కూలు వెనుక బాగం వైపు ఆరు తరగతి గదులను నిర్మించడం జరిగింది.


1998 నుండి 2003 వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన వి జె ఎస్ పాలన్ గారు స్కూలు భవనం యొక్క పైకప్పు (రూఫ్) ని ధృడంగా ఉండేలా మార్చి - తలుపులు కిటికీ లు బలంగా ఉండేలా ఏర్పాటు చేయించడం జరిగింది.


2003 నుండి 2006 వరకూ జి నళిని గారు ప్రధాన ఉపాద్యాయురాలు గా పనిచేసి స్కూలుకి సైన్స్ & సాస్కృతిక విభాగాలలో అనేక అవార్డులు సంపాదించి పెట్టి 2005-2006 విద్యాసంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాద్యాయురాలు బహుమతి ని అందుకోవడం జరిగింది అంతే కాకుండా . స్కూలుకి డబుల్ క్లాస్ రూం వసతిని కల్పించి కళావేదిక (స్టేజి) పైకప్పు ని ఏర్పాటు చేయించారు.


2006 నుండి 2011 వరకూ ప్రధాన ఉపాద్యాయురాలు గా పనిచేసిన ఎస్ మేరీ గ్రేస్ గారు ముందు ఉన్నటువంటి పాత భవనాన్ని పాక్షికంగా తొలగించి ఇప్పుడు బయటికి కనిపించే పెద్ద భవనాన్ని 2011 లో తన ఉద్యోగ కాలం చివరలో నిర్మింప చేయడం జరిగింది.


2011 లో స్కూలు కరస్పాండెంట్ బి. జాన్ పీటర్ గారు స్కూలు భవనం యొక్క వంద సంవత్సరాల వేడుక (సెంటినరీ ఇయర్ అఫ్ ది స్కూల్ బిల్డింగ్) ని 31.10.2011 న నిర్వహించడం జరిగింది మరియు గోలి రామారావు గారి అద్యక్షతన పూర్వ విద్యార్ధులంతా ఒక కమిటీ గా ఏర్పడి స్కూలు భవనాన్ని పటిష్ఠ పరచాలనే నిర్ణయాన్ని తీసుకుని తదనుగుణంగా ప్రణాలికలు సిద్దం చేసుకోవడం జరిగింది.


మీ వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...