Monday 18 January 2016

A Painful Story about Ragavamma Peddapuram - పెద్దాపురం సంస్థానం : పరమ సాధ్వీ మణి - త్యాగశీలి రాగమ్మ గారు :

పెద్దాపురం సంస్థానం : పరమ సాధ్వీ మణి - త్యాగశీలి రాగమ్మ గారు :


కటిక రాయికైనా కన్నీరు తెప్పించే రాగమ్మగారి జీవిత కధ తప్పక చదవాల్సిందే
భారత దేశంలో వీరనారీ మణుల చరిత్రలు కోకొల్లలు ... అదే కోవకి చెందుతుంది మన పెద్దాపురం రాగమ్మగారి గారి చరితం.
బార్యగా అమ్మగా మహారాణీగా పరువు నిలుపుకునే ప్రయత్నంలో ప్రాణత్యాగానికి పాల్పడ్డ పరమ సాధ్వీ మణిగా ఆమె చరిత్రలో నిలిచి పోయింది.
రుస్తుం ఖానుండి విద్రోహానికి బలి అయ్యిపోయిన రాగమ్మ గారి జీవిత చరిత్ర చదివితే కటిక రాయికైనా కన్నీరు రాక మానదు 




గొట్టుముక్కల భగవాన్ రాజు గారి ముద్దుల కూతురు అయిన శ్రీ గొట్టుముక్కల రాగమ్మ గారు వత్సవాయి ఉద్దండ రాయజగపతి బహద్దరు గారిని వివాహం చేసుకుని తిమ్మ రాజ జగపతి, భలబద్ర రాజ జగపతి, సూరపరాజు అనే ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది. ఉద్దండ రాయుడు గారు పెద్దాపురం సంస్థానాన్ని 1688 నుండి 1714 వరకూ పరిపాలించి 1714 లో కన్ను మూసే సమయానికి పెద్ద కుమారుడైన తిమ్మరాజ జగపతికి 10 సంవత్సరాలే కావడంతో, ముగ్గురు కుమారులు మైనరులు కావడం వల్ల - పెద్దకుమారుని సింహాసనాన్ని అధిష్టింప చేసి అతని పేర రాగమ్మ గారే 1714 నుండి రాజ్య పాలన కావించారు.పేద ప్రజారహిత పెద్దాపురం ప్రాభవాన్ని కాంక్షించిన పరమ సాధ్వీమణి రాగమ్మ గారు పెద్దాపురం తాలుకాలో రాగంపేట గ్రామాన్ని మరియు అక్కడికి దగ్గరలో ఉన్న రాగమ్మ చెరువు ఈమె చలవ వలననే ఏర్పరచ బడినవి.


రుస్తుం ఖాన్ విద్రోహ చర్యకి బలి అయిపోయిన రాగమ్మ
రుస్తుం ఖాన్ పెద్దాపురం కోటని ఆక్రమించుకోవాలనే కుతంత్రంతో పాడవుల మెట్ట దగ్గరకి వచ్చి వేచి వుండి తన కుమారుడైన నూరుద్దీన్ ఖాన్ ను రాగమ్మ గారి వద్దకి పంపి రాజ్యం - రాజ్య వ్యవహారాలకి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి రాజకుమారులను పంపించాల్సిందిగా కోరాడు (నూరుద్దీన్ ఖాన్ ముగ్గురు రాజ కుమారులకు మంచి మిత్రుడు) రుస్తుం ఖాన్ యొక్క దుర్మార్గ పూరిత ఆలోచన తెలియని రాగమ్మ గారు అమాయకంగా అనాలోచితంగా ముగ్గురు నీ రుస్తుం ఖాన్ దగ్గరకి ఎటువంటి సైన్యం లేకుండా పపించింది. రుస్తుం ఖాన్ వారిని సాదరంగా తన డేరాలోకి పిలిపించి అత్యంత ప్రేమ నటిస్తూ సలసల మరిగే నూనె ను జొన్న వెన్నులలో పోయించి వీపుల మీద కొట్టించి అత్ కిరాతకం గా హతమార్చెను ( చనిపోయే నాటికి రాగమ్మ గారి పెద్ద కొడుకైన తిమ్మరాజ జగపతి కి 34 సంవత్సరాలు మరియు ఏడాది వయస్సున్న బాలుడు కలడు)
రుస్తుం ఖాన్ పెద్దాపురం కోటని ఆక్రమించు కోవడానికి వస్తున్న వార్తని వేగులు(గూఢ చారులు) ద్వారా తెలుసుకున్న రాగమ్మ గారు. తురుష్కుల భారిన పడకూడదని (తురుష్కులు అంతపుర స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారు మహారాణులను వివస్త్రలు చేసి వీధుల వెంబడి ఊరేగించేవారు. అంతపుర కాంతలపై హత్యాచారాలకు తెగబడి అతి కిరాతకంగా వేధించి చంపేసేవారు) అందుచేత ఏడాది వయసున్న బాలుడు జగపతి ని కోట దాటించి విజయనగరం పంపించే ఏర్పాట్లు చేసి కోట గేట్లు మూయించేసారు.
సంస్థాన సేవకులలో అత్యంత విశ్వాస పాత్రుడైన చల్లా పెద్ది ని అంతపురానికి నిప్పు పెట్టమని ఆజ్ఞాపించి మొదట తానే అగ్నికి ప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసుకుంది ఆమె వెంట అంతపుర స్త్రీలందరూ అగ్నికి ఆహుతయ్యారు.
మీ వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...