Monday 18 January 2016

మహారాణీ కళాశాల - MAHA RANI COLLEGE -S.R.V.B.S.J.B M.R. COLLEGE - PEDDAPURAM

మా మహారాణీ కళాశాల - కళావికాసానికి కోవెల




శ్రీ రాజా వత్సవాయి జగపతి బహద్దరు మహారాణీ కాలేజీ

తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు

S.B.P.B.K. సత్యనారాయణ గారి విశేష కృషి

పెద్దాపురం ప్రజల బలమైన ఆకాంక్ష.

మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారి మంచి మనసు.







వెరసి మహారాణీ కాలేజీ ఆగష్టు 1967 వ సంవత్సరంలో మహారాణీ సత్రం యొక్క మిగులు నిధులు నుంచి రూ. 90,000/- కాలేజీ కి అవసరమైన స్థలం కొనుగోలు నిమిత్తం సర్వారాయ ఎడ్యుకేషన్ ట్రస్టు నిధులు నుంచి రూ, 50,000/- మరియు ఇంకా ఇతర అవసారాల నిమిత్తం అయిన ఖర్చులను శ్రీ ముప్పన అంకయ్య సోదరులు పెద్ద మనసుతో స్వచ్చందంగా ఇవ్వగా పెద్దాపురం పరిసర ప్రాంత విద్యార్ధుల ఆశాదీపం మహారాణీ కళాశాల స్థాపన ఘనంగా జరిగింది.

కళాశాల స్థాపనకి పురిగోల్పిన సంఘటనలు.
-----------------------------------------
1967 ఆరోజుల్లో పెద్దాపురం పేరుకి డివిజన్ ముఖ్య కేంద్రం అయినప్పటికీ అక్షరాస్యతా శాతం లో అట్టడుగు స్థానం లో వుండేది. యస్ యస్ యల్ సి చదివిన వారి సంఖ్య వేళ్ళ మీద లెక్కించవచ్చు అంత తక్కువగా ఉండేది. జిల్లాల్లో రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం లాంటి ప్రాంతాలలో మాత్రమే హైస్కూళ్ళు ఉండటంతో సుదూర ప్రాంతాలనుడి విద్యార్ధులు ఉన్నత విద్య కోసం పెద్దాపురం వచ్చేవారు. పెద్దాపురం ప్రజలలో ఎక్కువ శాతం మంది వ్యవసాయ, చేనేత, చేతి వృత్తులవారు కావడంతో చాలా మంది పేద విద్యార్ధులు యస్ యస్ యల్ సి అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులైనప్పటికీ కళాశాల చదువుల కోసం చెన్నపట్టణం పోలేక కన్నీళ్లు దిగమింగుకొని కార్మికులుగానే స్థిరపడి పోయేవారు.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రతీ విద్యార్ధికి ఉన్నత చదువులు చేరువకావాలనే సత్ సంకల్పం తో మహానుబావుల విశేష పరిశ్రమ వల్ల కళాశాల స్థాపన జరిగింది.

1967 లో పి. యు. సి (P.U.C), బి. ఎ (B.A) మరియు బి.కామ్ (B.Com) లలో 200 మంది విద్యార్ధులు-15 మంది స్టాఫ్ తో ప్రారంభమై,

తరువాత సంవత్సరమైన 1968 లో బి. ఎస్. సి(B.S.C) లో కొన్ని కాంబినేషన్లతో,

ఆ తరువాత 1969 సంవత్సరంలో పి. యు. సి ని సైన్స్, ఆర్ట్స్, కామర్స్, విభాగాలు లో రెండు సంవత్సరాల ఇంటర్ మీడియట్ గా మార్చడం,

జూలై 1987 లో అటానమస్ గా గుర్తిపు పొంది బి. ఎ - బి యెస్. సి కోర్సులలో గల అన్ని కాంబినేషన్ లు ( B.S.C. Mpac, Mpe – B.A. Epp, Ecf) లు జత చేయడం జరిగింది.

ఆ తరువాత 1993 - 94 నుంచి అటానమస్ వద్దు అనుకుని ఆంధ్రా యూనివర్సిటీ రెగ్యులేషన్ ఫాలో అవ్వడం,

2007 సంవత్సరం నుండి పి. జి కోర్సులు కూడా ప్రారంభించి -



18 ఎకరాల సువిశాల స్థలం, విశాలమైన క్రీడా ప్రాంగణం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, క్రమశిక్షణతో కూడిన విద్య - అంకిత బావాన్ని అలవరిచే ఎన్ సి సి (N.C.C) - సామాజిక బాద్యతను పెంపొందిచే ఎన్. యెస్. ఎస్. (N.S.S), రెడ్ క్రాస్ -




పూర్తి స్థాయి సాంకేతిక పరికరాలతో కూడిన లాబరేటరీ - ఇ క్లాస్ రూమ్స్ - విద్యార్ధులకు ఇంటర్నెట్ సౌకర్యం, అధునాతన లైబ్రరీ, తో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ దిన దిన ప్రవర్ధమాన మవుతూ నేటికి 2000 విద్యార్ధులు, 60 టీచింగ్ స్టాఫ్ మరియు 50 నాన్ టీచింగ్ స్టాఫ్ తో సరస్వతీ నిలయంగా శోభిల్లుతుంది.





ఈ కళాశాలలో చదివి పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఎందరో

నీతి నిజాయితీ కి మారు పేరుగా పిలువబడే రౌతులపూడి రైతుబిడ్డ చదివింది అర్ నారాయణమూర్తి మా కాలేజీ లోనే

గడచిన 48 సంవత్సరాలలో కూడా ఇక్కడ చదివిన ఏ ఒక్క విద్యార్ధి కూడా అసంతృప్తితో లేదంటే అది అతిశయోక్తికాదు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇతర కళాశాల ల యాజమాన్యం - అద్యాపకులు అందరూ ఈ కళాశాలలో చదివిన వారే

మన కాలేజీ నేర్చుకునే వాడికి చదువు

వచ్చి కూర్చునే వాడికి బ్రతుకు దెరువు నేర్పుతుంది అందుకే

బాగా చదివిన వారు విదేశాలలో

మిడిగా చదివిన వాడు మాస్టారు గానూ

అస్సలు చదవకుండా గ్రౌండ్ పట్టుకుని తిరిగిన వాడు పోలీసుగానూ సెటిల్ అయ్యిపోతాడని మా చౌదరి మాస్టారు ఛలోక్తులు విసిరే వారు.

ఇక్కడ చదివిన వారు కవులుగా - కళా కారులుగా, క్రీడాకారులుగా, రచయితలుగా, రాజకీయనాయకులుగా సమాజంలోని అన్ని శాఖలోనూ ఉద్యోగాలను అధిరోహించిన వారిలో వున్నారు. జ్ఞానం - విజ్ఞానం, వినోద - విలువలు, నీతి - నిజాయితీ, నిర్భీతి, లాంటి అనేక లక్షణాల సమ్మేళనం ఇక్కడ చదివిన విద్యార్ధుల సొంతం.



లక్షల జీతాలకు ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నా మా తల్లి మహారాణి కాలేజీ పై మమకారం చావక తనువు చాలించే వరకూ ఇక్కడే సేవలందించిన మహానుభావులైన మాస్టార్లకు ... పి. హెచ్. డి లు (P.H.D) ఎమ్. ఫిల్ M. Fill లు చేసి విద్యార్ధుల అభివృద్దే ధ్యేయంగా నిరంతరం తపిస్తున్న శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దరు మహారాణీ కళాశాల ఆచార్య దేవులకు పాదాభి వందనం తెలియ జేసుకుంటూ
                                                                                                                                మీ వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...