Monday 18 January 2016

పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చింది.... ? History Behind Name of Peddapuram

 పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చింది.... ? 


అనే విషయం లో భిన్న కధనాలున్నాయి.

పెద్దాపురం ను పెదపాత్రుడు ఆక్రమించుకొన్నాడు - పెద్దాపురం పేరే మార్చేయాలి అనే వాదనలూ ఉన్నాయి ....

అవి పక్కన పెడితే పెద్దాపురం పేరుకి సంబంధించి కిమ్మూరు కైఫీయతు - పెద్దాపురం సంస్థాన చరిత్రము లనుండి నేను అర్ధం చేసుకున్నది తెలియజేస్తున్నాను - తప్పులు వుంటే పెద్దలు దయచేసి తెలియచేయండి సరిచేస్తాను.


పార్ధాపురం >>>>> కిమ్మూరు సీమ >>>>>> పొర్లునాడు >>>>>>> పెద్దాపురం
---------------------------------------------------------------------------------------------------

పార్ధాపురం:
పురాణాలు, స్థానిక చరిత్రల ప్రకారం పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడ నివశించడం జరిగింది
(దానికి సాక్ష్యాలు ఇంకా "అమరగిరి - పాండవుల మెట్ట" మీద సజీవంగానే వున్నాయి).
పాండవ మధ్యముడు అయినటువంటి అర్జునుడి పేరు మీద (అర్జునుడి కి పార్ధ అనే పేరు కూడా వున్నది) "పార్ధాపురం" అనే పేరుతో ఈ ప్రాంతమంతా పిలువబడేది. కాలక్రమంలో ఈ "పార్ధాపురం" కాస్తా వ్యవహారం లో (పలుగాకుల నోల్లబడి) "పెద్దాపురం" గా స్థిరపడింది.



కిమ్మూరు :

పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు పెద్దాపురం ఉన్న ప్రాంతాన్ని పెద్దాపురం పరిసర ప్రాంతాలను కిమ్మెరుడు అనే కిరాత రాజు పరిపాలించే వాడు ఆ కారణం చేత ఈ ప్రాంతమంతా అతని పేరునే కిమ్మూరు సీమ గా వ్యవహరింపబడేది (కిమ్మెరుని వధ కధ కోసం నా కాండ్రకోట ని కన్నులారా చూతము రారండి ని చూడండి)


పొర్లునాడు :
పెద్దాపురం పిఠాపురం ల మద్య ఏలేరు నది ప్రవహించడం మూలాన ఆంధ్రరాష్ట్రం అంతా ఈ రెండు ప్రాంతాలను పొర్లునాడు అని పిలిచేవారు.




పెద్దాపురం పేరు వెనక వృత్తాంతం :
ఈ ప్రాంతం గజపతిల ఆదీనం లోనికి రాకముందు రెడ్డిరాజులు పాలించేవారు అల్లాడ వేమారెడ్డి వంశం లోని వాడైన రెడ్డి వెంకటప్పనాయుడు కిమ్మూరు, కొవ్వాడ, గురుగుమిల్లి, గూటాల, క్రొత్తపల్లి ని పరిపాలిస్తున్నప్పుడు అతని సరదారు గా ఉన్నటువంటి ఇసుకపల్లి పెరుమాళ్ల పాత్రుడు అధీనంలో ఈ కిమ్మూరు సీమ వుండేది.

ఇతని అనంతరం ఇతని వంశంలోని వాడే అయిన " పెద్దాపాత్రుడు "** సిబ్బంది కి, సైన్యానికి అయిన వ్యయం పోగా మిగిలిన ఆదాయమంతా తమకి పంపాలనే ఒప్పందం మీద రెడ్డి రాజుల ఆమోదంతో ఈ కిమ్మూరు సీమకి పరిపాలకుడయ్యెను.

ఆ తరువాత అప్పటి కిమ్మూరు సీమ లో బాగంగా వున్నా తమిరే అనే గ్రామానికి ఉత్తర బాగాన ఉన్నటువంటి రెండు పెద్ద పెద్ద మెట్టలని చదును చేయించి అక్కడ ఒక్క కోటని కట్టించి చుట్టూ మట్టి గోడ పెట్టించి వాటిపై చుట్టూ బురుజులు తీర్పించి ఆ కోటలో అతను నివాసముంటూ ప్రజలు నివశించ దానికి వీలుగా ఒక పేటను కట్టించి దానికి అతని పేరు మీదనే " పెద్దాపురం "** అని పేరు పెట్టాడు.

చుట్టూ పక్కల ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలవడంతో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం కావడంతో ఇక్కడికి జనాల వలసలు పెరిగాయి. (ఆ తరువాత కాలంలో నీటి సమస్యల ఇక్కడినుండీ వలస పోయారు చాలామంది) తరువాత విస్సమ్మ అనే రెడ్డి వనిత రెండువేల పౌజులకు వత్సవాయి ముసలి తిమ్మరాజు గారికి (చతుర్బుజ తిమ్మ జగపతి మహారాజు) గారికి తాకట్టు పెట్టడం జరిగింది.

ఆ తరువాత వత్సవాయి వంశస్తులు పెద్దాపురాన్ని సుబిక్షంగా పరిపాలించిన విధానం మీకు తెలిసిందే ...... !

తప్పులు వుంటే మన్నించండి సవరణలు తెలియజేస్తే తప్పక సరిచేయగలను

....................................................................ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...