
పెద్దాపురం శివాలయం ఒకప్పుడు పట్టణ శివారు ప్రాంతం ఇక్కడ చాలా కాలం క్రితం స్మశానం ఉండేదిగా తెలుస్తుంది .... పెద్దాపురం సంస్థానాన్ని రాజా వత్సవాయ జగపతి మహా రాజు గారు పరిపాలించే కాలంలో ఒక మహా సాధువు హిమాలయా, కాశీ తదితర యాత్రలను ముగించుకుని తన సొంత గ్రామము తరలి పోయే దారిలో పెద్దాపురం సంస్థానం లోని ఒకా నొక సత్రం నందు బస చేయడం జరిగిందట .... ఆయన వద్ద గల ఎద్దుల బండిలో కాంతులీనీతూ ఒక మహా శివ లింగం ఉండటాన్ని గమనించిన గ్రామ ప్రజలు ఆ శివ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయమని కోరారట సాధువు ఎంత మాత్రం ఒప్పుకోక పోవడంతో ... గ్రామ ప్రజలు రాజు గారి వద్దకు తీసుకు వెళ్లి ఒప్పించి మహా రాజు సమక్షం లోనే శివ లింగ ప్రతిష్ఠ చేయించడం జరిగిందట ... అప్పటి నుండీ భక్తులు పరమ శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్దలతో పూజించుకుంటున్నారు - దేవాలయానికి 1969 ప్రాంతంలో పెద్దాపురం శిల్పులతో గోపురం నిర్మింపచేయడం జరిగింది - పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
No comments:
Post a Comment